Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిలవని పేరంటానికి వచ్చారు.. పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:01 IST)
పెళ్లికి పిలవలేదనే కోపంతో ముగ్గురు యువకులు పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిలారా అనే గ్రామంలో షేర్ సింగ్ కుహ్వాహా మేనల్లుడి పెళ్లి జరుగుతోంది. ఆ వివాహానికి గ్రామంలోని అందరినీ ఆహ్వానించారు. కానీ, హరేంద్ర సింగ్, బాలి, గుడ్డు రానాలను మాత్రం ఆహ్వానించలేదు. ఆ ముగ్గురు ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో నిషాలో తూగుతూ ఉండడంతో వారిని పెళ్లికి పిలవలేదు. 
 
అయితే తమను పెళ్లికి పిలవకపోయినా ఆ ముగ్గురు గత మంగళవారం జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పిలవని పేరంటానికి వచ్చినా కూడా పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ఎవరూ వారిని ఏమీ అనకుండా స్వాగతించారు. పెళ్లికి హాజరైన ఆ ముగ్గురు భోజనం పూర్తయ్యాక తమతో తెచ్చుకున్న గన్‌తో పెళ్లికొడుకు మేనమామ మీద కాల్పులు జరిపారు. 
 
హరేంద్ర సింగ్ రానా గన్‌తో కాల్పులు జరుపుతుంటే, మిగిలిన ఇద్దరూ పక్కనే ఉన్నారు. కాల్పులు అనంతరం వారంతా పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments