Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల పాపపై యువకుడి అత్యాచారం.. కాశ్మీర్‌లో దారుణం

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:41 IST)
లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. కామాంధులు మాత్రం వయో బేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఈ రాంబన్ జిల్లాలో కేవలం మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాంబన్ జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి బయట ఆడుకుంటుండగా ఆ పాపని చాక్లెట్లు ఇస్తానని  చెప్పి... తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికను గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. దీనితో ఆ చిన్నారి ఏడుపు విన్న తల్లి వెంటనే అతని ఇంటికి వెళ్లగా అక్కడ ఉన్న నిందితుడు పరారయ్యాడు. 
 
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికుల సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించడంతో పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఫోక్సో చట్టం కింద నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం