Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజులు భారీవర్షాలు: వాతావ‌ర‌ణ శాఖ‌

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (09:37 IST)
నైరుతి రుతుప‌వ‌నాల విస్త‌ర‌ణ‌కు వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మంగ‌ళ‌వారం నాటికి తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడన ద్రోణి ఏర్ప‌డుతుంద‌ని, ఆ త‌ర్వాత 24 గంట‌ల్లో ప‌శ్చిమ వాయ‌వ్య దిశ‌గా ప్ర‌యాణిస్తుంద‌ని చెప్పింది.

దీని ప్ర‌భావంతో రానున్న రెండు మూడ్రోజుల్లో గోవా, క‌ర్ణాట‌క‌, రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర‌, త‌మిళ‌నాడులోని మ‌రిన్ని ప్రాంతాల‌కు రుతుప‌వ‌నాలు వ్యాపిస్తాయ‌ని వెల్ల‌డించింది.
 
ఈ ప్ర‌భావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు‌ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నేడు, రేపు, ఎల్లుండి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అలాగే తెలంగాణ స‌హా మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్భ‌, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments