Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంస సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోంది: మోడీ

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:59 IST)
విధ్వంసకర సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోందని, ఉగ్రవాద శక్తులు తాత్కాలికంగా ఆధిపత్యం చెలాయించొచ్చేమో కానీ శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ ఆలయానికి చెందిన పలు ప్రాజెక్టులను మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు, ఉగ్రవాదం ద్వారా సామాజ్య్రాలను సృష్టించే సిద్ధాంతాలను అనుసరించే వారి ఉనికి శాశ్వతం కాదని, వారు మానవత్వాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరని స్పష్టం చేశారు.

ఇటువంటి సమయంలో ఈ సోమనాథ్‌ దేవాలయం ప్రపంచానికి ఉత్తమమైన ఉదాహరణ అని, భరోసాగా ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నా, నేడు నూతనంగా ఆధునీకరించబడిందని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఇటీవల తాలిబన్లు వశపరుచుకున్న నేపథ్యంలో మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో మతపరమైన పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments