''వ్యభిచారిణి'' అంటే భార్య ఎలా ఓర్చుకుంటుంది.. సుప్రీం కోర్టు

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:15 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ''వ్యభిచారి'' అంటూ దూషించిన భర్తను ఆవేశంలో భార్య కొట్టి చంపేసింది. దీన్ని హత్యగా పరిగణించలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది. భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పిన భర్త.. తన భార్యాకూతుళ్లను వ్యభిచారిణులు అని దూషించాడు. దీంతో భార్య ఆవేశానికి గురైంది. అంతేగాకుండా భర్తపై భార్య ఆవేశంతో దాడి చేసింది. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన భర్త మరణించాడు. ఈ కేసులో శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ అప్పీలు చేయడం జరిగింది. ఈ కేసుపై విచారణకు అనంతరం తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు.. కట్టుకున్న భర్తే.. తనను, తన కుమార్తెలను వ్యభిచారులని దూషించడాన్ని ఏ భారతీయ మహిళ ఓర్చుకోలేదని సుప్రీం తెలిపింది. 
 
అంతేగాకుండా తనతో పాటు తన కుమార్తెలను కూడా భర్త ఆ పదంతో దూషించడాన్ని ఓర్చుకోవడం కష్టమని.. అలాంటి పదాలను ఉపయోగించడమే సదరు మహిళ ఆవేశానికి కారణమైందని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఆవేశానికి గురిచేసే లాంటి వ్యాఖ్యలు చేయడంతోనే సదరు మహిళ దాడికి దిగిందని.. దీన్ని హత్యగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇంకా ఈ కేసులో సదరు మహిళకు శిక్షా కాలాన్ని పదేళ్లు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments