Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వాదించలేక నాలుక కోసేసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (09:45 IST)
సహజంగా ఆడవారిపైనే వేధింపులు ఎక్కువ నమోదవుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భార్య వేధింపులు తాళలేని ఆ భర్త ఏకంగా నాలుక కోసేసుకున్నాడు. ఈ ఘటన కాన్పూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిషా, ముఖేష్ అనే భార్యాభర్తలు. ఐతే ఈమధ్య కాలంలో భర్తతో నిషా తరచూ గొడవపడుతోంది. భర్త ఎంత సర్దుకు పోదామని చూస్తున్నా ఆమె అతడిపై రేగు కంపలా పడుతోంది. తిట్ల పురాణం అందుకుంటోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లడంతో నిషా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంతకీ రాకపోయేసరికి ముఖేష్ తనే తలొగ్గి భార్యకు ఫోన్ చేసాడు. కలిసి వుందామనీ, గొడవలు వద్దని నచ్చజెప్పాడు. ఐతే ఆమె ఆ సందర్భంలో కూడా గయ్యమంటూ గొడవకు దిగింది. దీనితో ఆమెతో వాదించలేని భర్త బ్లేడుతో తన నాలుకను కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు గమనించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments