Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వాదించలేక నాలుక కోసేసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (09:45 IST)
సహజంగా ఆడవారిపైనే వేధింపులు ఎక్కువ నమోదవుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భార్య వేధింపులు తాళలేని ఆ భర్త ఏకంగా నాలుక కోసేసుకున్నాడు. ఈ ఘటన కాన్పూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిషా, ముఖేష్ అనే భార్యాభర్తలు. ఐతే ఈమధ్య కాలంలో భర్తతో నిషా తరచూ గొడవపడుతోంది. భర్త ఎంత సర్దుకు పోదామని చూస్తున్నా ఆమె అతడిపై రేగు కంపలా పడుతోంది. తిట్ల పురాణం అందుకుంటోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లడంతో నిషా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంతకీ రాకపోయేసరికి ముఖేష్ తనే తలొగ్గి భార్యకు ఫోన్ చేసాడు. కలిసి వుందామనీ, గొడవలు వద్దని నచ్చజెప్పాడు. ఐతే ఆమె ఆ సందర్భంలో కూడా గయ్యమంటూ గొడవకు దిగింది. దీనితో ఆమెతో వాదించలేని భర్త బ్లేడుతో తన నాలుకను కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు గమనించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments