Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ కూర.. వేడి చేసి తినడంతో బాలిక మృతి

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (22:24 IST)
తమిళనాడులో ముందు రోజు చేసిన చికెన్ కూరను ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు వేడి చేసి తిన్న బాలిక ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు, అరియలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అరియలూరు జిల్లాలోని జయంగొండం సమీపంలోని గ్రామానికి చెందిన గోవిందరాజులు - అన్బరసి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటన జరిగిన రోజు గోవిందరాజులు తాను నిర్మించనున్న కొత్త ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 
 
ఆ సందర్భంగా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లి కోడి కూర తీసుకుని ఇంట్లో వండిపెట్టారు. మిగిలిన చికెన్ పులుసును ఫ్రిడ్జిలో ఉంచి మరుసటి రోజు తిన్నారు. ఆ సమయంలో పాత కూర గ్రేవీ తిన్న ఏడో తరగతి చదువుతున్న చిన్న కూతురు లిథిర అస్వస్థతకు గురైంది. 
 
వెంటనే జయంగొండం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా పాత కోడి కూర పులుసు తిన్న తండ్రి గోవిందరాజులు, తల్లి అన్బరసి, సోదరి ద్వారక కూడా అనారోగ్య కారణాలతో జయంగొండం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments