Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేరుకున్న తొలి విమానం

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (21:33 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధ భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ దేశాన్ని రష్యా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిలో అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, తాజాగా 219 మందితో ఉక్రెయిన్ నుంచి సరిహద్దు రొమేనియా నుంచి శనివారం మధ్యాహ్నం బయలుదేరిన ఎయిరిండియా విమానం శనివారం రాత్రి ముంబైకు సురక్షితంగా చేరింది. ఈ విమానంలో వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్వాగతం పలికారు. 
 
కాగా, భారత విదేశాంగ శాఖ సూచనలను అనుసరిస్తూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల్లో 219 మంది రొమేనియా సరిహద్దులు చేరుకున్నారు. వీరిని అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన ఎయిరిండియా విమానంలో ఎక్కించారు. ఆ వెంటనే టేకాప్ తీసుకున్న విమానం సురక్షితంగా ముంబైకు చేరుకుంది. యుద్ధ నేపథ్యంలో భీతావహ పరిస్థితులను కళ్లారా చూసిన భారత విద్యార్థులు ముంబైకి చేరుకోగానే ఊపిరి పీల్చుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం