Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (20:38 IST)
రాజకీయ కారణాలతోశబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా తనపై దాడి చేశారంటూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుందని పేర్కొంది. ఇటీవల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని మహిళా కార్యకర్త బిందు అమ్మిని వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్​పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలవగా... కేసు విచారణను నవంబర్​ 14న విస్తృత ధర్మాసనానికి అప్పగించింది న్యాయస్థానం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments