Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ సమయంలోనైనా ఉగ్రదాడులు: ఇంటెలిజెన్స్‌

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (06:31 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం అయోధ్యపై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి.

భారీ దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఏ సమయంలోనైనా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) సంస్థలకు చెందిన  అధికారులు తెలిపారు. దీనిపై ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాకు సమాచారం అందింది.

అయోధ్య తీర్పు ఏ రోజైనా వెలువడవచ్చనే వార్తలు బయటకి వచ్చినప్పటి నుంచి జైషే ప్రణాళికల్లో వేగం పెరిగింది.  ఇప్పటికే భద్రతా దళాలకు సమాచారం అందజేశాం. ఈ ఉగ్ర సంస్థ పలు కీల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో న్యూ దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు ప్రధానంగా ఉన్నాయి’ అని తెలిపారు. 

ఈ ఏడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉగ్ర మూకలు ఇలాంటి కుట్రలకు ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి. మరోవైపు భారత భద్రతా దళాలు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి.

తాజాగా అయోధ్య తీర్పు వెలువడటంతో మరోసారి దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments