Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (15:29 IST)
Dead Body
పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో  పోస్టుమార్టం వద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండలం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెందాడని తెలుసుకుని బోరుమంది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. 
 
అందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహన్ని భుజంపై వేసుకుని మలయ్య గుండెపోటుతో చనిపోయాడని.. ఆయన మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదంటూ పరుగులు తీశాడు. కానీ పోలీసులు అతడిని వెంబడించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments