తెలంగాణ రైతుకు దుబాయ్‌లో లాటరీ తగిలింది.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:36 IST)
భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు. అంతే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ రైతు లాటరీతో కోటీశ్వరుడు కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్.. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. 
 
అయితే ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం వెతికాడు కానీ ఉద్యోగం దొరకలేదు. దీంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశాడు. అయితే, యూఏఈలో ఉన్నప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది అతనికి. 
 
సొంతూరికి వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు. దీంతో భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడికి పంపించాడు. అలా లాటరీ టిక్కెట్లు కొనేలా చేశాడు.
 
అయితే ఆ లాటరీ ద్వారానే ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఆ లాటరీ టికెట్‌కే కోట్లు తగిలాయి. తన భార్య వల్లే ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పాడు. దుబాయ్‌లో కొన్న ఓ లాటరీ టికెట్‌కు సుమారు రూ.29 కోట్ల నగదు బహుమతి లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments