Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యాలను వదిలిన బూత్ బంగళా ఇచ్చారు : లాలూ తనయుడు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టార

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (08:51 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టారనీ, అందుకే ఆ బంగళాను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
 
తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్నప్పుడు దేశ్‌రత్న్‌ మార్గ్‌లోని భవనాన్ని కేటాయించారు. ఆది నుంచి వాస్తు, మతపరమైన విషయాలపై గట్టి నమ్మకం ఉన్న తేజ్‌ ఆ బంగ్లాను తన సెంటిమెంట్‌గా భావించారు. అప్పట్లో ఈ బంగ్లా ప్రధాన ద్వారం మూసేసి, పలు మార్పులు కూడా చేయించారు. 
 
కానీ మంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్‌ప్రతా్‌పకు నితీశ్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయినా బంగ్లాను ఖాళీ చేయని తేజ్‌.. పాట్నా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నోటీసులపై స్టే విధించింది. 
 
ఈ నేపథ్యంలో, ఆకస్మికంగా ఆయన ఆ బంగళాను ఖాళీ చేశారు. 'సీఎం నితీశ్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ నా ఇంట్లో దెయ్యాలను వదిలారు. అవి నన్ను వేధిస్తున్నాయి. అందుకే బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments