Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఇంజిన్ పైకెక్కి సెల్ఫీ దిగపోయిన బాలుడు.. విద్యుత్ షాక్‌తో..?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (18:33 IST)
రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు ఇంజిన్ పైకెక్కి సెల్ఫీ దిగపోయిన ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు పౌరసరఫరాల శాఖలో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. గురువారం తన 14 ఏళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్‌ను తనతోపాటు విధులకు తీసుకెళ్లాడు. అతను రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అతని కుమారుడు జ్ఞానేశ్వర్‌ సెల్ఫీ తీసుకునేందుకు ఆగి ఉన్న రైల్ ఇంజన్ పైకి ఎక్కాడు.
 
అయితే, రైల్ ఇంజన్ పైననే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్ వైర్‌లను గమనించకుండా జ్ఞానేశ్వర్ సెల్ఫీ కోసం చేయి పైకి లేపడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరునల్వేలి మెడికల్ కాలేజీకి పంపించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments