హోంవర్క్ చూపించమన్నాడనీ... టీచర్‌ను కత్తితో పొడిచిపారేసిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (10:10 IST)
సెలవుల్లో ఇచ్చిన హోం వర్క్ చేశాడో లేదో ఆ టీచర్ విద్యార్థులందరి నోటు పుస్తకాలను తనిఖీ చేసింది. అలాగే, ఓ విద్యార్థిని కూడా హోం వర్క్ చూపించమని కోరింది. ఇంక అంతే... ఆగ్రహంతో రగిలిపోయిన ఆ విద్యార్థి టీచర్‌ను కత్తితో పొడిచిపారేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో శ్రీరాంకృష్ణ అనే పాఠశాల ఉంది. నెల రోజుల సెలవుల తర్వాత సోమవారం స్కూలు తిరిగి ప్రారంభమైంది.‌ సెలవులకు ముందు 11వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ టీచర్ ముకేశ్ కుమారి (45) హోం వర్క్ ఇచ్చింది.
 
సోమవారం స్కూలు ప్రారంభమైన తర్వాత తానిచ్చిన హోం వర్క్ ఏ మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకుంటుండగా ఓ విద్యార్థి ఆమెపై పదునైన కత్తితో దాడిచేశాడు. ఆమె పొట్టలో పలుమార్లు విచక్షణ రహితంగా పొడిచాడు. 
 
తీవ్రంగా గాయపడిన టీచర్‌ను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కాన్పూరులోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (పీజీఐ)కి తరలించారు. టీచర్‌పై దాడిచేసిన విద్యార్థి పారిపోతుండగా మరో టీచర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments