Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుల్లుగా మద్యం సేవించి కుర్చీలో హాయిగా నిద్రపోయిన ఉపాధ్యాయుడు (Video)

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (14:51 IST)
అస్సాంలో ఓ కలియుగ ఉపాధ్యాయుడు వెలుగులోకి వచ్చారు. ఈ రాష్ట్రంలోని కామాఖ్య నగర్‌లో ఒక ఉపాధ్యాయుడు పీకల వరకు మద్యం సేవించి పాఠశాలకు వచ్చి... కుర్చీలో గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఆ ఉపాధ్యాయుడు కుర్చీ చుట్టూ విద్యార్థులు నిలబడి గోలగోల చేస్తూ, నిద్రలేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన ఉపాధ్యాయుడి తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూటుగా తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడికి ఆ తర్వాత మత్తు మరింత ఎక్కువైంది. కుర్చీలో కూలబడి అలాగే నిద్రపోయాడు. విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు అతడిని లేపేందుకు ప్రయత్నించినా చీమకుట్టినట్టు కూడా అతడికి అనిపించలేదు. ఈ ఘటన అస్సాంలోని కామాఖ్యనగరులో జరిగినట్టుగా తెలుస్తోంది. నిద్రపోతున్న ఉపాధ్యాయుడి చుట్టూ చేరిన విద్యార్థులు గోల చేస్తూ ఆయనను నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఆయనలో చలనం కనిపించలేదు. 
 
అంతేకాదు, నిద్రమత్తులో కుర్చీలోనే ఆయన మూత్ర విసర్జన చేసినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. వీడియో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యావిధానం ఇప్పటికే దారుణంగా ఉందని, ఇలాంటి బాధ్యతారహిత ఘటనలు దానిని మరింత దిగజారుస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments