Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు.. రంగారెడ్డిలో పాఠశాలలకు సెలవు

Advertiesment
hussain sagar

సెల్వి

, మంగళవారం, 20 ఆగస్టు 2024 (14:55 IST)
హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌లో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ 513.41లకు చేరింది. కాగా, మంగళవారం ఉదయానికి 513.63కి చేరింది. నీటిమట్టాలను పర్యవేక్షించిన అధికారులు 1,600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.
 
మరోవైపు రంగారెడ్డి జిల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోని మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలకు కనెక్టివిటీతో పాటు పాఠశాల భవనం పరిస్థితిని అంచనా వేయాలని, అవసరమైతే సెలవు ప్రకటించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండగ సీజన్.. రద్దీ మార్గాల్లో ఇపుడే పెరిగిపోయిన విమాన చార్జీలు