Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారాంతపు సెలవులు... తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు

trains

ఠాగూర్

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (16:55 IST)
వారాంతపు సెలవులను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు.. వరలక్ష్మివ్రతం కారణంగా శుక్రవారం, శనివారం, ఆదివారం కలుపుకుని వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లను నర్సాపుర్‌ - సికింద్రాబాద్‌, కాకినాడ పట్టణం - సికింద్రాబాద్‌, కాచిగూడ - తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను ఏర్పాటు చేసింది. 
 
నర్సాపురం - సికింద్రాబాద్‌ (07175) రైలు ఆగస్టు 18న (ఆదివారం) నర్సాపుర్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయాన్నే 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. అలాగే, సికింద్రాబాద్‌ - నర్సాపుర్‌ (07176) రైలు ఆగస్టు 19న (సోమవారం) సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు నర్సాపుర్‌ చేరుకోనుంది. 
 
కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ (07177) రైలు ఆగస్టు 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి.. ఆ మరుసటి రోజుల్లో ఉదయం 9.05 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకొంటుంది. అలాగే, ఈనెల 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరనున్న సికింద్రాబాద్‌ - కాకినాడ టౌన్‌ (07178) రైలు ఆగస్టు 19, 21వ తేదీల్లో ఉదయాన్నే 6.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. 
 
కాచిగూడ - తిరుపతి (07455) రైలు ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి ఆగస్టు 17న (శనివారం) ఉదయం 10.25గంటలకు తిరుపతి చేరుకోనుంది. అలాగే, తిరుపతి - కాచిగూడ (07456) రైలు ఆగస్టు 17న తిరుపతిలో రాత్రి 7.50గంటలకు బయల్దేరి..  మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9.30గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 
 
కాచిగూడ పట్టణం - సికింద్రాబాద్‌ రైలు ఆగస్టు 18న సాయంత్రం 6.30గంటలకు కాకినాడలో బయల్దేరి.. మరుసటిరోజు ఉదయాన్నే 6 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. ఇకపోతే 07188 నంబర్‌ కలిగిన రైలు సికింద్రాబాద్‌లోఆగస్టు 19న రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేసినా అభ్యంతరం లేదు... : కేటీఆర్