Webdunia - Bharat's app for daily news and videos

Install App

తౌక్టే తుపాను బీభ‌త్సం... క‌ర్ణాట‌క‌లో న‌లుగురి మృతి...

Webdunia
ఆదివారం, 16 మే 2021 (14:12 IST)
తౌక్టే తుపాను సృష్టిస్తోన్న బీభ‌త్సానికి క‌ర్ణాట‌క‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. క‌ర్ణాట‌క‌లోని తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. 
 
అంతేగాక‌, 'తౌక్టే' అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూరప్ప ప‌లు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లతో స‌మావేశం నిర్వ‌హించి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు. కాగా, ఈ నెల 18న ఉదయం గుజరాత్‌ వద్ద తుపాను తీరం దాటుతుందని ఇప్ప‌టికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్ర‌క‌టించింది. 

ప్రస్తుతం పంజిమ్‌ - గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరం, ముంబైకి 520 కిలోమీటర్ల దూరంలో అది ఉందని అధికారులు చెప్పారు. గోవా తీర ప్రాంతాలపై కూడా తుపాను ప్ర‌భావం క‌న‌ప‌డుతోంది. వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే  సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments