తౌక్టే తుపాను బీభ‌త్సం... క‌ర్ణాట‌క‌లో న‌లుగురి మృతి...

Webdunia
ఆదివారం, 16 మే 2021 (14:12 IST)
తౌక్టే తుపాను సృష్టిస్తోన్న బీభ‌త్సానికి క‌ర్ణాట‌క‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. క‌ర్ణాట‌క‌లోని తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. 
 
అంతేగాక‌, 'తౌక్టే' అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూరప్ప ప‌లు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లతో స‌మావేశం నిర్వ‌హించి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు. కాగా, ఈ నెల 18న ఉదయం గుజరాత్‌ వద్ద తుపాను తీరం దాటుతుందని ఇప్ప‌టికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్ర‌క‌టించింది. 

ప్రస్తుతం పంజిమ్‌ - గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరం, ముంబైకి 520 కిలోమీటర్ల దూరంలో అది ఉందని అధికారులు చెప్పారు. గోవా తీర ప్రాంతాలపై కూడా తుపాను ప్ర‌భావం క‌న‌ప‌డుతోంది. వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే  సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments