Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పెరిగిపోతున్న కరోనా పాజిటివిటీ రేటు.. కేంద్రం ఆందోళ

ఏపీలో పెరిగిపోతున్న కరోనా పాజిటివిటీ రేటు.. కేంద్రం ఆందోళ
, ఆదివారం, 16 మే 2021 (09:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పాజిటివిటీ రేటు విపరీతంగా పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. కరోనా కేసులు తీవ్రస్థాయిలో ఉన్న ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో గత వారం రోజులుగా కరోనా పాజిటివిటీ వృద్ధిరేటు అత్యధికంగా 30 శాతం ఉందన్నారు. ముఖ్యంగా, విశాఖపట్టణం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు.
 
ఇకపోతే, జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ సుజీత్ కె.సింగ్ మాట్లాడుతూ.. సమీప గ్రామాల నుంచి కొవిడ్ రోగులను పట్టణాలకు తరలించే అవకాశం ఉండడంతో పట్టణాల్లోని ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని సూచించారు. ఇప్పటివరకు 18 కోట్ల డోసుల టీకాలను ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు అందిస్తామన్నారు.
 
స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతి ఇచ్చామని, ఆగస్టు-డిసెంబరు మధ్య మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జైడస్ క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్ నోవావ్యాక్స్, భారత్ బయోటెక్ నుంచి నాసల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అన్నీ కలిపి దాదాపు 216 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ మంత్రులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యపై అనుమానం.. అడవికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు కట్టేసి మర్మాంగాలు కోసిన భర్త