Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికి ఇడ్లీ.. 80 ఏళ్ల బామ్మ రోజుకి వెయ్యి ఇడ్లీలు అమ్ముతుందట..!

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:09 IST)
రూపాయికి ఇడ్లీ ఇవ్వడం అనేది ప్రస్తుతం సాధ్యం కాని విషయం. కానీ తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక్క ఇడ్లీని రూపాయికి అమ్ముతూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు, కోవై, వడివేలంపాళయంకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక ఇడ్లీని రూపాయికి అమ్ముతోంది. ఇంకా చట్నీ, సాంబార్ కూడా రూపాయి ఇడ్లీకి అమ్ముతోంది. 30 ఏళ్ల క్రితం కమలాథాయ్ అనే 80 ఏళ్ల బామ్మ ఇడ్లీలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. 
 
ఈ వ్యాపారం గురించి ఆ బామ్మ మాట్లాడుతూ.. తనది వ్యవసాయ కుటుంబం అని.. 30 ఏళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పింది. ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులు తనను ఇంట వదిలి పొలాలకు వెళ్లిపోయేవారని.. ఆ సమయంలో ఖాళీగా వుండలేక తన ఊరు ప్రజల కోసం చౌక ధరకే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఇవ్వదలుచుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఈ క్రమంలో ఇడ్లీ షాపు ప్రారంభించానని చెప్పింది. ఇందుకోసం ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకునే దాన్ని. అలాగే తాజా కూరగాయలను, పిండిని ఉపయోగిస్తానని.. రోజుకు వెయ్యి ఇడ్లీలు అమ్ముతానని వెల్లడించింది. 
 
తొలుత ఒక ఇడ్లీ 50 పైసలకు అమ్మానని.. ప్రస్తుతం ఆ ధర రూపాయికి పెరిగిందని తెలిపింది. పేద ప్రజలకు ఈ ధర గిట్టుబాటు కావడంతో ఇడ్లీలు అమ్ముడుపోతుంటాయని వెల్లడించింది. ఇంకా కూలీలు, కార్మికులకు కడుపునిండా అల్పాహారం పెట్టడం సంతోషంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments