Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికి ఇడ్లీ.. 80 ఏళ్ల బామ్మ రోజుకి వెయ్యి ఇడ్లీలు అమ్ముతుందట..!

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:09 IST)
రూపాయికి ఇడ్లీ ఇవ్వడం అనేది ప్రస్తుతం సాధ్యం కాని విషయం. కానీ తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక్క ఇడ్లీని రూపాయికి అమ్ముతూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు, కోవై, వడివేలంపాళయంకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక ఇడ్లీని రూపాయికి అమ్ముతోంది. ఇంకా చట్నీ, సాంబార్ కూడా రూపాయి ఇడ్లీకి అమ్ముతోంది. 30 ఏళ్ల క్రితం కమలాథాయ్ అనే 80 ఏళ్ల బామ్మ ఇడ్లీలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. 
 
ఈ వ్యాపారం గురించి ఆ బామ్మ మాట్లాడుతూ.. తనది వ్యవసాయ కుటుంబం అని.. 30 ఏళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పింది. ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులు తనను ఇంట వదిలి పొలాలకు వెళ్లిపోయేవారని.. ఆ సమయంలో ఖాళీగా వుండలేక తన ఊరు ప్రజల కోసం చౌక ధరకే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఇవ్వదలుచుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఈ క్రమంలో ఇడ్లీ షాపు ప్రారంభించానని చెప్పింది. ఇందుకోసం ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకునే దాన్ని. అలాగే తాజా కూరగాయలను, పిండిని ఉపయోగిస్తానని.. రోజుకు వెయ్యి ఇడ్లీలు అమ్ముతానని వెల్లడించింది. 
 
తొలుత ఒక ఇడ్లీ 50 పైసలకు అమ్మానని.. ప్రస్తుతం ఆ ధర రూపాయికి పెరిగిందని తెలిపింది. పేద ప్రజలకు ఈ ధర గిట్టుబాటు కావడంతో ఇడ్లీలు అమ్ముడుపోతుంటాయని వెల్లడించింది. ఇంకా కూలీలు, కార్మికులకు కడుపునిండా అల్పాహారం పెట్టడం సంతోషంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments