Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికి ఇడ్లీ.. 80 ఏళ్ల బామ్మ రోజుకి వెయ్యి ఇడ్లీలు అమ్ముతుందట..!

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:09 IST)
రూపాయికి ఇడ్లీ ఇవ్వడం అనేది ప్రస్తుతం సాధ్యం కాని విషయం. కానీ తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక్క ఇడ్లీని రూపాయికి అమ్ముతూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు, కోవై, వడివేలంపాళయంకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక ఇడ్లీని రూపాయికి అమ్ముతోంది. ఇంకా చట్నీ, సాంబార్ కూడా రూపాయి ఇడ్లీకి అమ్ముతోంది. 30 ఏళ్ల క్రితం కమలాథాయ్ అనే 80 ఏళ్ల బామ్మ ఇడ్లీలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. 
 
ఈ వ్యాపారం గురించి ఆ బామ్మ మాట్లాడుతూ.. తనది వ్యవసాయ కుటుంబం అని.. 30 ఏళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పింది. ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులు తనను ఇంట వదిలి పొలాలకు వెళ్లిపోయేవారని.. ఆ సమయంలో ఖాళీగా వుండలేక తన ఊరు ప్రజల కోసం చౌక ధరకే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఇవ్వదలుచుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఈ క్రమంలో ఇడ్లీ షాపు ప్రారంభించానని చెప్పింది. ఇందుకోసం ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకునే దాన్ని. అలాగే తాజా కూరగాయలను, పిండిని ఉపయోగిస్తానని.. రోజుకు వెయ్యి ఇడ్లీలు అమ్ముతానని వెల్లడించింది. 
 
తొలుత ఒక ఇడ్లీ 50 పైసలకు అమ్మానని.. ప్రస్తుతం ఆ ధర రూపాయికి పెరిగిందని తెలిపింది. పేద ప్రజలకు ఈ ధర గిట్టుబాటు కావడంతో ఇడ్లీలు అమ్ముడుపోతుంటాయని వెల్లడించింది. ఇంకా కూలీలు, కార్మికులకు కడుపునిండా అల్పాహారం పెట్టడం సంతోషంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments