Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి పట్ల వైద్యుడి నిర్లక్ష్యం.. సూది మొన అక్కడ ఇరుక్కుపోయింది..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (10:40 IST)
వైద్యులు ఏకాగ్రతతో చేయాల్సిన పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు నడుము తొంటి భాగంలో సూది ఇరుక్కుపోయింది. నొప్పితో చిన్నారి అల్లాడుతున్నా వైద్యులు పట్టించుకోలేదని శిశువు తల్లి ఆరోపించారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. 
 
తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. ఎట్టిమదైపూర్‌కి చెందిన రమీలా(26) ఇటీవల భర్త కార్తీకేయన్‌తో గొడవ కారణంగా కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లాక కొడుకు అనారోగ్యం బారిన పడటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేసి సూది మందు ఇచ్చారు. అయితే సూది మందు ఇస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. సూది మొన కాస్త తొంటిలో ఇరుక్కుపోయింది.
 
దీంతో చిన్నారికి అక్కడ వాపు వచ్చింది. మరుసటి రోజు ఈ విషయాన్ని గమనించారు. కానీ చిన్నారికి వాపు ఎక్కువ కావడంతో రమీలా దానిపై గట్టిగా నొక్కడంతో.. సూది మొన బయటపడింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments