ప్రియుడు మోజులో భర్త - కన్నబిడ్డను హత్య చేసిన భార్య...

Webdunia
శనివారం, 18 మే 2019 (10:49 IST)
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు మోజులోపడిన ఓ మహిళ... కట్టుకున్న భర్తతోపాటు కన్నబిడ్డను సైతం హత్య చేసింది. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, తాజ్‌పురా మందవేలికి చెందిన రాజా (25) అనే వ్యక్తికి రెండేళ్ళ క్రితం దీపిక అనే యువతితో వివాహమైంది. వీరికి యేడాదిన్నర వయసున్న ప్రనీష్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రాజా స్నేహితుడు ఒకరు తరుచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. 
 
అతనితో దీపికకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, దీపిక పూర్తిగా ప్రియుడుతోనే ఉండాలని భావించింది. ఇందుకోసం తన భర్తతో పాటు కన్నబిడ్డ అడ్డు తొలగించుకోవాలని భావించి, తన ప్లాన్‌ను ప్రియుడుకు చెప్పింది. వారంతా కలిసి అనుకున్నట్టుగానే భర్త రాజా, కుమారుడు ప్రినీష్‌లను హత్య చేసి, సమీపంలో ఉన్న చెరువులో పాతిపెట్టారు. 
 
ఆ తర్వాత ఈ నెల 13వ తేదీన దీపిక ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త, కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో రాజా ఫోన్ నంబరు ఇవ్వాలని పోలీసులు అడిగారు. అతడు ఫోన్ తీసుకెళ్లలేదని, ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు దీపిక పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. 
 
దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం వెల్లడైంది. అయితే, ఈ పని దీపిక, అతని ప్రియుడు మాత్రమే చేయలేరని మరికొంతమంది సాయం తీసుకుని వుంటారని పోలీసులు భావిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments