Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి రక్షణ : చచ్చిన పామును ఆరగించిన రైతు కూలీ

Webdunia
ఆదివారం, 30 మే 2021 (15:58 IST)
గత యేడాదిన్నర కాలంగా కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బాధితులుగా ఉన్నారు. 
 
ఈ వైరస్ స్వైర విహారం దెబ్బకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిపై అపోహలు ఉన్నాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కరోనా నుంచి రక్షణ కలిగిస్తుందంటూ చచ్చినపామును తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అతడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వడివేలు ఓ రైతు కూలీ. ఇటీవల వడివేలు ఓ చచ్చినపామును తిన్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పామును తింటే కరోనా రాదని వడివేలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. 
 
కరోనా నుంచి రక్షణ కోసమే పామును చంపి తింటున్నానని అతడు వివరించాడు. అయితే ఈ వీడియో స్థానిక అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వడివేలును అరెస్ట్ చేశారు. అతడికి ఏడు వేల రూపాయలు జరిమానాగా విధించారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments