Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్‌డౌన్ : ఏడో రాష్ట్రంగా తమిళనాడు... 30 వరకు అన్నీ బందే

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:37 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖంపట్టని రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఆదివారం 106 కొత్త కేసులు నమోదు కాదు, సోమవారం ఈ సంఖ్య 98గా ఉంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1173కు చేరుకుంది. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు తమిళనాడు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా లాక్‌డౌన్ పొడగించిన రాష్ట్రాల్లో తమిళనాడు ఏడో రాష్ట్రంగా నిలిచింది.  
 
అలాగే, తమిళనాడు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో కేవలం 50 మంది మాత్రమే కోలుకోగా 11 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం సాయంత్రం వరకు మొత్తం 208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కోయంబత్తూరులో 126, తిరుపూరులో 78, ఈరోడులో 64, దిండిగల్‌లో 56, తిరునెల్వేలిలో 56, నామక్కల్‌, చెంగల్పట్టు జిల్లాల్లో 45 చొప్పున నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments