Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్‌డౌన్ : ఏడో రాష్ట్రంగా తమిళనాడు... 30 వరకు అన్నీ బందే

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:37 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖంపట్టని రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఆదివారం 106 కొత్త కేసులు నమోదు కాదు, సోమవారం ఈ సంఖ్య 98గా ఉంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1173కు చేరుకుంది. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు తమిళనాడు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా లాక్‌డౌన్ పొడగించిన రాష్ట్రాల్లో తమిళనాడు ఏడో రాష్ట్రంగా నిలిచింది.  
 
అలాగే, తమిళనాడు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో కేవలం 50 మంది మాత్రమే కోలుకోగా 11 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం సాయంత్రం వరకు మొత్తం 208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కోయంబత్తూరులో 126, తిరుపూరులో 78, ఈరోడులో 64, దిండిగల్‌లో 56, తిరునెల్వేలిలో 56, నామక్కల్‌, చెంగల్పట్టు జిల్లాల్లో 45 చొప్పున నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments