Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్‌డౌన్ : ఏడో రాష్ట్రంగా తమిళనాడు... 30 వరకు అన్నీ బందే

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:37 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖంపట్టని రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఆదివారం 106 కొత్త కేసులు నమోదు కాదు, సోమవారం ఈ సంఖ్య 98గా ఉంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1173కు చేరుకుంది. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు తమిళనాడు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా లాక్‌డౌన్ పొడగించిన రాష్ట్రాల్లో తమిళనాడు ఏడో రాష్ట్రంగా నిలిచింది.  
 
అలాగే, తమిళనాడు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో కేవలం 50 మంది మాత్రమే కోలుకోగా 11 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం సాయంత్రం వరకు మొత్తం 208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కోయంబత్తూరులో 126, తిరుపూరులో 78, ఈరోడులో 64, దిండిగల్‌లో 56, తిరునెల్వేలిలో 56, నామక్కల్‌, చెంగల్పట్టు జిల్లాల్లో 45 చొప్పున నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments