Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం పళణిస్వామి

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (18:36 IST)
గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ వర్షాల ధాటికి భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో హైదరాబాదులో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం పళణిస్వామికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన తమిళనాడు సీఎం భారీ వర్షాలు వరదలతో నష్టపోవడం విచారకరమన్నారు.
 
తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజలకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేస్తామని, సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణమే 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
 
వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినందుకు గాను తమిళనాడు సీఎం పళణిస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments