Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం పళణిస్వామి

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (18:36 IST)
గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ వర్షాల ధాటికి భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో హైదరాబాదులో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం పళణిస్వామికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన తమిళనాడు సీఎం భారీ వర్షాలు వరదలతో నష్టపోవడం విచారకరమన్నారు.
 
తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజలకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేస్తామని, సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణమే 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
 
వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినందుకు గాను తమిళనాడు సీఎం పళణిస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments