Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మరో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:05 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో స్కూలు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంమది. ఈ ఘటన మంగళవారం జరిగింది. 
 
బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మరోవైపు, ఈ బాలిక తరచుగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో  విద్యార్థిని ప్రాణాలు తీసుుకంది. దీంతో గత రెండు వారాల్లో ముగ్గురు ప్లస్ టూ విద్యారఅథులు, ఒక ప్లస్ వన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఆత్మహత్యలు రాష్ట్రంలో పెను కలకలం సృష్టిస్తున్నాయి.
 
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరీక్షలను విజయవంతంగా మార్చుకోవాలని, విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం