Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు రైతులకు ఎన్నికల తాయిలం రుణమాఫీ!

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:45 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి భావిస్తున్నారు. ఇందుకోసం ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నారు. తాజాగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇందుకోసం రూ.12,110 కోట్లను కేటాయిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న దాదాపు 16.43లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం దక్కనుంది.
 
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పలు పథకాలకు అన్నాడీఎంకే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్న ఆయన తెలిపారు. 
 
రైతు రుణమాఫీనే కాకుండా మరిన్ని నూతన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ డీఎంకేపై మండిపడ్డ ఆయన, రెండు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించి అమలులో విఫలమైందని ప్రతిపక్షపార్టీపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments