Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (09:59 IST)
తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ యువకుడు తన ప్రియురాలి మెడలో మృతదేహం వద్దే తాళికట్టాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని కవణై అనే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ అనే రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఆయన రెండో కుమారుడు అప్పు అనే యువకుడు న్యాయశాస్త్రం  అభ్యసిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న విజయశాంతి అనే అనే యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో తన తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో  తన తండ్రి మృతదేహం వద్దే పెళ్ళి చేసుకోవాలని అప్పు నిర్ణయించాడు. 
 
దీనికి వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సమ్మతం తెలిపారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువుల సమక్షంలోనే తన ప్రియురాలి మెడలో అప్పు పసుపుతాడు కట్టి ఆ యువతిని తన అర్థాంగిగా చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి భౌతికకాయానికి నమస్కరించి ఆశీస్సులు పొందారు. దీంతో ఆ ఇంటిలో ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషం నెలకొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments