Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

Advertiesment
Marriage

సెల్వి

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:38 IST)
Marriage
తమిళనాడులో విషాధ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం ముందే కుమారుడి పెళ్లి జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలో కవణై గ్రామం ఉంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఊరికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కాగా.. ఆయనకు అప్పు కుమారుడు.. ప్రస్తుతం లా చదువుతున్నాడు. 
 
అప్పు విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ప్రియురాలు కూడా ఓకే చెప్పింది. అంతే తండ్రి భౌతిక కాయం ముందే ప్రేయసి మెడలో తాళి కట్టేశాడు. 
 
కన్నీళ్లు పెట్టుకుంటూనే పెళ్లి చేసుకున్నాడు. కొత్త జంటను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు ఆశీర్వదించారు. కాకపోతే అమ్మాయి తరఫు బంధువులు ఈ పెళ్లికి రాలేదు.. పుట్టెడు దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)