Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ గృహాల్లోకి వచ్చిన భారీ మొసలి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:47 IST)
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లుతున్నాయి. 
 
ముఖ్యంగా, శివపురి జిల్లాలో వాగులు వంకలు నదులు ఉప్పొంగడంతో అనేక నివాసాల్లోకి నీరు వచ్చిచేరింది. దీంతో మొసళ్లు నివాసాల్లోకి వచ్చి చేరాయి. దీంతో స్థానికలు భయభ్రాంతులకు గురయ్యారు.
 
మొస‌ళ్లు జనావాసాల్లోకి రావడంతో స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. మొద‌ట బ‌స్టాండ్ వ‌ద్ద ఓ మొస‌లి క‌నిపించింద‌ని గ్రామ‌స్తులు తెలిపారు. ఆ త‌ర్వాత నివాసాల మ‌ధ్య‌కు చేరుకుని, భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. 
 
దీంతో ఈ మొస‌ళ్లను ప‌ట్టుకునేందుకు స్థానికంగా ఉన్న మాధ‌వ్ నేష‌న‌ల్ పార్క్ నుంచి అట‌వీ శాఖ అధికారులు వ‌చ్చారు. గంట‌ల పాటు శ్ర‌మించి ఓ 8 అడుగుల పొడ‌వున్న మొస‌లిని బంధించారు. అనంత‌రం సంఖ్యా సాగ‌ర్ లేక్‌లో వ‌దిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments