Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ స్టేట్ హైకోర్టుకు కొత్తగా మరో ఆరుగురు జడ్జీలు

Draupadi Murmu
, శనివారం, 13 ఆగస్టు 2022 (08:41 IST)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా మరో ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ ఆరుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం ఇదివరకే ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆరుగురు కొత్త న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
హైకోర్టు కొత్త జడ్జీలుగా నియమితులైన జాబితాలో ఏనుగుల వెంక‌ట వేణుగోపాల్‌, న‌గేశ్ భీమ‌పాక‌, పుల్ల కార్తీక్‌, కాజా శ‌ర‌త్‌, జ‌గ్గ‌న్నగారి శ్రీనివాస‌రావు, నామ‌వ‌ర‌పు రాజేశ్వ‌ర‌రావులు ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో వీరు త్వ‌ర‌లోనే హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వివేకా హత్య కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత