Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (09:33 IST)
దీపావళి రోజు టపాసులు రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పెద్దమొత్తంలో టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.


ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. టపాసుల విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.  దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. 
 
ఇక క్రిస్మస్‌, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును తమిళ తంబీలు పట్టించుకోలేదు. నరక చతుర్దశి సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లపైకి వచ్చి మరీ టపాకాయాలు కాల్చారు యువత. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ మనోభావాలకు ఈ తీర్పు వ్యతిరేకమని చెప్తున్నారు. సుప్రీం ఆదేశాలను రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వీటిని పాటించిన పరిస్థితి కనిపించలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments