Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో భాజపాను పడగొట్టింది చంద్రబాబు నాయుడే... ఎవరు?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (19:01 IST)
అమరావతి :  ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ప్రధాని మోదీ నాశనం చేశారని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ హిదాయత్ సచివాలయంలో విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలోని మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారని, ఆయన నిర్ణయాన్ని హిదాయత్ స్వాగతించారు. మోదీ నియంతృత్వ పాలనను అంతమొందించేందుకు, కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి 5 కోట్ల మంది తెలుగు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని అన్నారు. 
 
నియంత మోదీకి భయపడి ఆయనను ఎదురించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ లాంటి నేతలు కూడా ముందుకు రాని సమయంలో, సీఎం చంద్రబాబునాయుడు ధైర్యంగా ముందుకు వచ్చారని హిదాయత్ కొనియాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారిని చైతన్య పరచి అక్కడ బీజేపీ అధికారంలోకి రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుకోగలిగారని హిదాయత్ గుర్తుచేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైసీపీ, జనసేన అధినేతలు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. 
 
మోదీ హఠావో...దేశ్ కీ బచావో నినాదంతో ముందుకు వెళతామని హిదాయత్ ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌవరం దెబ్బతిన్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అప్పటి గవర్నర్ రామ్ లాల్ ఉదంతం తెలియజేస్తోందని, ఇప్పుడు మరోసారి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు సీఎం చంద్రబాబునాయుడు ముందుకు వచ్చారని హిదాయత్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, కుట్రలు పన్నుతున్నా వైసీపీ, జనసేన అధినేతలు వెన్నెముకలేని వారిగా వ్యవహరిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని నిర్వీర్యం చేసినా వైసీపీ, జనసేన నేతలు నోరు మెదపడం లేదని హిదాయత్ దుయ్యబట్టారు. అసెంబ్లీ, లోక్ సభల నుంచి పారిపోయిన వైసీపీకి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే భాద్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడే ఉద్యమానికి సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారని, ఈ ఉధ్యమానికి అందరూ మద్దతు పలికి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడుకోవాలని హిదాయత్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments