Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు.. రిజర్వేషన్లూ ముఖ్యమే : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:08 IST)
విద్యార్థుల ప్రతిభతకు కేవలం మార్కులు మాత్రమే ముఖ్యం కాదనీ రిజర్వేషన్లు కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అపెక్స్ కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్‌లో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. 
 
ఈ మేరకు ఈ నెల 7వ తేదీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాకుండా, 2021-22 అడ్మిషన్లలో రిజర్వేషన్లు యదాతథంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. 
 
ఒక విద్యార్థి సామాజిక ఆర్థిక నేపథ్యానికి సంబంధించి తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఈ రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ, సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇది మరింతగా పెంచుతుందని న్యాయమూర్తులు చంద్రచూడ్, బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల 2021-22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments