Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు.. రిజర్వేషన్లూ ముఖ్యమే : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:08 IST)
విద్యార్థుల ప్రతిభతకు కేవలం మార్కులు మాత్రమే ముఖ్యం కాదనీ రిజర్వేషన్లు కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అపెక్స్ కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్‌లో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. 
 
ఈ మేరకు ఈ నెల 7వ తేదీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాకుండా, 2021-22 అడ్మిషన్లలో రిజర్వేషన్లు యదాతథంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. 
 
ఒక విద్యార్థి సామాజిక ఆర్థిక నేపథ్యానికి సంబంధించి తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఈ రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ, సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇది మరింతగా పెంచుతుందని న్యాయమూర్తులు చంద్రచూడ్, బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల 2021-22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments