Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టు విచారణ

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (09:09 IST)
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పెగాసస్ స్పైవేర్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం కీలక విచారణ చేపట్టనుంది. ఈ కేసుతో పాటు మరో మూడు కీలక కేసులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
ఈ ముూడు కీలక కేసుల్లో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ దాఖలైన పిటిషన్‌తో పాటు పీఎల్ఎంఏపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు జనవరిలో పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్లపై సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
వీటన్నింటిలోకెల్లా పెగాసస్ స్పైవేర్ కేసు అత్యంత కీలకంగా ఉంది. జర్నలిస్టులు, పార్లమెంటేరియన్లు, ప్రముఖులపై గూఢచర్య చేసేందుకు ప్రభుత్వం ఇజ్రాయేల్ మిలిటరీ నుంచి గ్రేడ్ మాల్వేను‌ కేంద్రం కొనుగోలు చేసి ఉపయోగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌‍ను స్వీకరించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటినీ గత యేడాది అక్టోబరు నెలలో నియమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments