Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకటించిన తేదీల్లోనే పీజీ నీట్ పరీక్ష - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:14 IST)
దేశంలోని పీజీ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు విద్యార్థుల కోసం ఎక్కువ మంది విద్యార్థులు నష్టం కలిగించేలా ఆదేశించలేమని పేర్కొంది. వాయిదా వేస్తే ఇప్పటికే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించింది. 
 
పరీక్ష కోసం దాదాపు 2.06 లక్షల మందికి పైగా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, ఇలాంటి సందర్భంలో పరీక్ష వాయిదావేసి వారికి నష్టం చేకూర్చలేమని పేర్కొంది. అలా చేయడం వల్ల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నీట్ పీజీతో పాటు ఏ యేడాది కౌన్సెలింగ్ తేదీలు క్లాష్ అవుతున్నాయని, అందుకే వాయిదా వేయాలని కోరుతున్నామని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. 
 
ఇప్పటికే అకడమిక్ షెడ్యూల్ నాలుగు నెలలు ఆలస్యమైందని, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకని నీట్ 2022-23ను ఆలస్యంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు కూడా 2021 నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని, వారు నీట్ 2022 రాయకుండా ఎవరూ అడ్డుకోలేదని ధర్మాసనం గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments