Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకటించిన తేదీల్లోనే పీజీ నీట్ పరీక్ష - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:14 IST)
దేశంలోని పీజీ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు విద్యార్థుల కోసం ఎక్కువ మంది విద్యార్థులు నష్టం కలిగించేలా ఆదేశించలేమని పేర్కొంది. వాయిదా వేస్తే ఇప్పటికే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించింది. 
 
పరీక్ష కోసం దాదాపు 2.06 లక్షల మందికి పైగా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, ఇలాంటి సందర్భంలో పరీక్ష వాయిదావేసి వారికి నష్టం చేకూర్చలేమని పేర్కొంది. అలా చేయడం వల్ల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నీట్ పీజీతో పాటు ఏ యేడాది కౌన్సెలింగ్ తేదీలు క్లాష్ అవుతున్నాయని, అందుకే వాయిదా వేయాలని కోరుతున్నామని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. 
 
ఇప్పటికే అకడమిక్ షెడ్యూల్ నాలుగు నెలలు ఆలస్యమైందని, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకని నీట్ 2022-23ను ఆలస్యంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు కూడా 2021 నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని, వారు నీట్ 2022 రాయకుండా ఎవరూ అడ్డుకోలేదని ధర్మాసనం గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments