Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంట్రల్‌ విస్టా పనులపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనుల్లో జరిగిన భూ వినియోగ మార్పిడిపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ప్రజల మానసిక ఉల్లాసం కోసం ఉద్దేశించిన స్థలంలో నివాస గృహాలు నిర్మిస్తుండటంపై అభ్యంతరం తెలుపుతూ వ్యాజ్యం దాఖలైంది. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఆ స్థలంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాస గృహాలను నిర్మించనున్నట్టు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
 
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 'అంటే.. ఇక్కడ ఇకపై ప్రజల మానసికోల్లాసానికి స్థలం ఉండదా? వేరే చోట ఆ సౌకర్యాలు కల్పిస్తారా' అని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకొని సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. దాంతో ఆ ఒక్క విషయంపైనే మూడు రోజుల్లో సంక్షిప్తంగా ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం