Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సర్కారుతో పాటు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:21 IST)
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ చేసిన పిటిషన్‌లో మొత్తం 14 పార్టీలను చేర్చారు. వీటిలో తమిళనాడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, డీజీపీ, పోలీస్ కమిషనర్, సీబీఐ, ఇతరులు ఉన్నారు.
 
ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు, డీఎంకే నేత అయిన ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికీ ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.
 
కాగా సెప్టెంబర్ 2 సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి, దానిని వ్యతిరేకించడమే కాదు, "నిర్మూలన" చేయమని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. సనాతన నిర్మూలన సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments