Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇకపై ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదు

aadhaar
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:26 IST)
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటరు నమోదుకు ఆధార్ నంబరు తప్పనిసరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. 
 
ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్‌ను సమర్పించింది. ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో జత చేసినట్లు గుర్తు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది.
 
ఎన్నికల గుర్తింపుకార్డుతో ఆధార్ నెంబరును అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్రం గత ఏడాది జూన్ నెలలో ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022ని నోటిఫై చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేత నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అండర్ టేకింగ్‌ను సమర్పించింది. అండర్ టేకింగ్‌లో ఫారం 6, ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26బీ ప్రకారం ఆధార్ నెంబర్ సమర్పణ తప్పనిసరి కాదని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి కొరత : నాసిక్ జిల్లాలో వేలం నిలిపివేత