Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిసిటీ పిచ్చికి జరిమానా...

Webdunia
బుధవారం, 13 మే 2020 (16:35 IST)
పులిని చూసి నక్క వాతలు వేసుకుంది అనేది పాత సామెత అయితే... హీరోలను చూసి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అనేది కొత్త సామెత. మరి అలాంటి యువతలో తాను ఒక్కడిని అనుకున్నాడో ఏమో కానీ ఆయన చేసిన పనికి ఉన్నతాధికారుల మందలింపుతో పాటు జరిమానా కూడా కట్టుకోవాల్సి వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... తమిళం నుండి తెలుగుకి డబ్బింగ్ అయి తెలుగునాట కూడా కలెక్షన్‌ల వర్షం కురిపించిన సింగం సినిమా హిందీ రీమేక్‌లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ రెండు కార్లపై నిలబడి ప్రయాణించే సీన్ ఒకటి ఉంది. దీని నుండి ప్రేరణ పొందిన దామెహ్ జిల్లాలోని నార్సింగ్‌గర్‌లో ఎస్సైగా పని చేస్తున్న మనోజ్ యాదవ్ కూడా ఇదే తరహాలో ఒక వీడియో చేసారు. 
 
అది కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయి పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక పోలీసు అధికారి ఇలా చేయడంపై జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ సదరు మనోజ్ యాదవ్‌ని మందలించడంతో పాటు జరిమానాని కూడా విధించారు.
 
ఇప్పటికే పబ్లిసిటీ కోసం వివిధ విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతకు కూడా ఈ విధమైన జరిమానాలు విధిస్తే... వారి పద్ధతి కూడా మారుతుందేమో మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments