Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం యంత్రంలో బుసలు కొడుతున్న పాము... ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 మే 2020 (16:21 IST)
లాక్డౌన్ పుణ్యమాన్ని వన్యప్రాణులతో పాటు క్రూరమృగాలు, జంతువులు, పక్షులు, పాములు ఇలా ప్రతి ఒక్క జీవరాశికి ఎక్కడలేని స్వేచ్ఛ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా మనిషి ఇంటికే పరిమితమయ్యాడు. ఇదే ఇతర జీవజాతులకు ఓ సువర్ణావకాశంలా మారింది. ఫలితంగా జనవాస ప్రాంతాలకు వస్తున్నాయి. రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. తాజాగా ఒక పాము ఏటీఎం యంత్రం నుంచి బుసలు కొడుతూ బయటకు రాలేక అందులోనే ఉండిపోయింది. దాన్ని చూసిన ఓ ఏటీఎం వినియోగదారుడు ప్రాణభయంతో పరుగు తీశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌లోని ఓ ఏటీఎం కేంద్రానికి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఆ మిషన్‌లో ఉన్న ఆ పాము.. వ్యక్తిని చూడగానే బుసలు కొట్టసాగింది. దీంతో ఆ వ్యక్తి భయపడి బయటకు దౌడు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తమకు తోచిన విధంగా జోక్స్ పేలుస్తున్నారు. 
 
లాక్డౌన్ వేళ పాము డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తోంది అంటూ కొందరు జోక్ చేయడం వీడియోలో వినిపిస్తోంది. చివరికి ఏటీఎం మెషీన్ పైభాగంలో ఓ కన్నం కనిపించడంతో ఈ భారీ పాము అందులోకి దూరిపోయింది. వీడియో మొదట్లో పెద్దగా ఆశ్చర్యంగా ఏమీ లేకపోయినా.. చివరికి పాము తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments