Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా బస్సులు సిద్ధం.. 36 సీట్ల స్థానంలో 26 సీట్లు

Webdunia
బుధవారం, 13 మే 2020 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించే చర్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 17వ తేదీతో ముగియనున్న లాక్డౌన్ తర్వాత ఈ ప్రజా రవాణా పునరుద్ధరించే అవకాశం ఉంది. 
 
అయితే, కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. ఖచ్చితంగా సామాజిక భౌతికదూరం పాటిస్తూనే, ముఖానికి మాస్క్ ధరించాల్సిన నిబంధన ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.
 
ప్రయాణికుల మధ్య దూరం తప్పనిసరిగా ఉండాల్సిన నేపథ్యంలో మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు కుదించారు. ప్రయాణికులు నడిచే దారిలో 8 సీట్లను అమర్చారు. 
 
అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
 
అయితే, ఈ బస్సులో ప్రయాణ చార్జీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. పది సీట్లను తొలగించడం వల్ల తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంది. దీన్ని భర్తీ చేసుకునే ప్రక్రియలో భాగంగా, అదనపు వడ్డనకు ఆర్టీసీ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం