Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (11:56 IST)
మహా శివరాత్రి పర్వదినం రోజున ఏ ఒక్క హిందువు మాంసాహారం తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు మాత్రం మాంసాహారం కోసం కొట్టుకున్నారు. ఏబీవీబీ, ఎస్ఎఫ్ఐ అనే రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు మాంసాహారం కోసం పోటీపడ్డారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న విద్యార్థులకు మాంసాహారం వడ్డించే ప్రయత్నం చేశారని ఏబీవీపీ విభాగం నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, ఏబీవీపీ విద్యార్థులే తొలుత తమపై దాడి చేశారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ మరింత తీవ్రత కావడంతో ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ వెలుగులోకి వచ్చింది. 
 
ఢిల్లీ యూనివర్శిటీలో గొడవపై మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. యూనివర్శిటీలో విద్యార్థులు గొడవ పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాంసాహారం వడ్డించడంపై క్యాంటీన్‌తో తొలుత విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరగడం, ఆపై వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ గొడవలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో గాయపడిన విద్యార్థిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
మహాశివరాత్రి రోజున మాంసాహారం వడ్డించకూడదన్న తమ ఆదేశాను కట్టుబడలేదన్న కారణంతోనే ఏబీవీపీ విద్యార్థులు తమపై దాడి చేశారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీ గూండాలు తమపైనా, మెస్ సిబ్బందిపైనా దాడిశారని పేర్కొన్నారు. అంతేకాదు, విద్యార్థినుల జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments