Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (11:23 IST)
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనపై పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన కేసులో రాయచోటి పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఆయనను శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
 
జనసేన పార్టీ నేత మణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానికి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచనున్నారు. ప్రస్తుతం పోసానిపై మొత్తం 11 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్రవిమర్శలు చేసినందుకు కూడా కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments