Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ మందలించడంతో మొదటి అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థిని

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (17:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో దారుణం జరిగింది. స్కూల్ టీచర్ తిట్టిందన్న కోపంతో ఓ విద్యార్థిని స్కూలు భవనంలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరింది. దీంతో ఆ బాలిక వీడియో తీసింది. 
 
దీన్ని గమనించిన ఓ టీచర్ ఆ బాలికను మందలించారు. బాలిక తీయమనడంతోనే తాను వీడియో తీశానని బాధిత విద్యార్థి చెప్పినా టీచర్ వినిపించుకోలేదు. పైగా, అబద్ధాలు చెబుతున్నావంటూ మందలిచింది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేయడంతో ఆ బాలిక గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments