Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ మందలించడంతో మొదటి అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థిని

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (17:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో దారుణం జరిగింది. స్కూల్ టీచర్ తిట్టిందన్న కోపంతో ఓ విద్యార్థిని స్కూలు భవనంలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరింది. దీంతో ఆ బాలిక వీడియో తీసింది. 
 
దీన్ని గమనించిన ఓ టీచర్ ఆ బాలికను మందలించారు. బాలిక తీయమనడంతోనే తాను వీడియో తీశానని బాధిత విద్యార్థి చెప్పినా టీచర్ వినిపించుకోలేదు. పైగా, అబద్ధాలు చెబుతున్నావంటూ మందలిచింది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేయడంతో ఆ బాలిక గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments