Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్ష.. లో-దుస్తులను విప్పించి.. పరీక్షా గదికి..?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:13 IST)
దేశ వ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుంటే, మరోవైపు అవమానకరంగా వందమంది అమ్మాయిల లో-దుస్తులను విప్పించి, పరీక్ష గదికి పంపించారు. దాంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలు అవమానం తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయ్యారు. 
 
పరీక్ష అనంతరం వారికి జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు సదరు కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాలోకి వెళ్తే.. కేరళలోని కొల్లాంలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిల పట్ల అక్కడి సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారు. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ అధికారులు నీట్ పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. 
 
అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలను అక్కడి సిబ్బంది నిశితంగా తనిఖీలు చేశారు. దాదాపు 100 మంది అమ్మాయిలను లోదుస్తులతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
 
కానీ, లోదుస్తులకు సంబంధించి అక్కడి సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో, తీవ్ర అవమానకర పరిస్థితుల్లో ఆ అమ్మాయిలు తమ లోదుస్తులు విప్పేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. 
 
పరీక్ష ముగిసిన తర్వాత తమకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కాలేజీ యాజమాన్యంపై భగ్గుమన్నారు. కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments