పురుషాధిక్యంపై సుప్రీం సీరియస్.. సమానత్వం బూటకం..!

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (10:46 IST)
పురుషాధిక్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఇది పురుషుల కోసం పురుషులు నిర్మించిన సమాజం. ఇక్కడ సమానత్వం గురించి మాట్లాడటం బూటకం అవుతుంది. ఈ నేపథ్యంలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అంతరాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి' అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
శాశ్వత కమిషన్‌లో తమకు చోటు కల్పించాలని చేసుకొన్న దరఖాస్తును ఆర్మీ తిరస్కరించడంపై కొంత మంది మహిళా సైనిక అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సైన్యంలో కూడా మహిళలపై వివక్ష కొనసాగుతున్నదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. 
 
మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేయడానికి ప్రవేశపెట్టిన వార్షిక రహస్య నివేదిక మందిపు ప్రక్రియలో వ్యవస్థీకృత వివక్ష దాగి ఉన్నదని పేర్కొన్నది. ఫిట్‌నెస్‌ పరీక్షలో పురుషులతో పోల్చడం అహేతుకమని కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది సెలక్షన్‌ బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులు దాటిన వారికి శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని తీర్పునిచ్చింది. ఏసీఆర్‌ను పక్కనపెట్టాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments