తూత్తుకుడి రణరంగం-స్టెరిలైట్ నిర్మాణం ఆపేయండి.. మద్రాస్ హైకోర్టు

తూత్తుకుడి రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేక పోరాటంలో హింస చోటుచేసుకుంది. ఈ హింసలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో

Webdunia
బుధవారం, 23 మే 2018 (12:52 IST)
తూత్తుకుడి రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేక పోరాటంలో హింస చోటుచేసుకుంది. ఈ హింసలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ స్టెరిలైట్ ఇండస్ట్రీస్ చేపట్టిన కాపర్ స్మెల్టర్ రెండో ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్లాంట్ నిర్మాణాన్ని నిరసిస్తూ నిన్న ప్రజలు ఆందోళనకు దిగగా, పరిస్థితులు అదుపుతప్పి పోలీసులు కాల్పులు జరపడం, 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం విచారణ నిర్వహించింది. కాపర్ స్మెల్టర్ ప్లాంట్‌ను నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

స్టెరిలైట్ విస్తరణ ప్రాజెక్టుపై సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ప్లాంట్ నిర్మాణం చేపట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా పర్యావరణ అనుమతులు కోరుతూ వేదాంత తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ పంపాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

Sapthami Gowda: సతీష్ నినాసం హీరోగా ది రైజ్ ఆఫ్ అశోక నుంచి పాట విడుదల

Renu Desai: రేణు దేశాయ్ నటిస్తున్న సినిమా 16 రోజుల పండగ

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments